తొలి లోక్ పాల్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్

భారతీయ ప్రజా స్వామ్యంలో సరికొత్త రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటయింది. తొలిలోక్పాల్ గా సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీనాకి చంద్రఘోష్ ను శనివారం 23/3/2019 న రాష్ట్రపతి భవన్ లో భారత ప్రధమ పౌరుడు రామ్ నాధ్ కొవింద్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ లోక్ పాల్ లో జ్యుడీషియల్ సభ్యులుగా
1. జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసలే
2.జస్టీస్ ప్రదీప్ కుమార్ మొహంతి
3.జస్టిస్ అభిలాష కుమారి
4.జస్టిస్ అజయకుమార్ త్రిపాఠీ
నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా
1 దినేష్ కుమార్ జైన్
2.అర్చనా రామసుందరం
3.మహేందర్ సింగ్
4.ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్
నియమితులయ్యారు
2011 లో అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమ ఫలితంగా 2013 లో నాటి యూపీఏ ప్రభుత్వం లోక్ పాల్ , లోకాయుక్త చట్టాలను తీసుకు వచ్చింది. దీనితో ఈ క్రొత్త వ్యవస్థ ఏర్పాటయింది. లోక్ పాల్ కేంద్ర ప్రభుత్వం లోని ప్రజా సేవకులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతుంది.

Comments

Popular posts from this blog